24-05-2025 12:00:00 AM
కొత్తగూడెం మే 23 (విజయక్రాంతి) ః భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ము న్సిపాలిటీ పరిధిలో గల చిట్టీ రామవరం, బస్తీ దవాఖానను , పాత కొత్తగూడెం ఆరోగ్య కేంద్రాని డాక్టర్ భాస్కర్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేశా రు ఒపి సేవలు ఎలా అందుతున్నాయో ప్ర జలను అడిగితెలుసుకున్నారు.
ఎమర్జెన్సీ మందుల నిర్వహణ, ఇల్ ఐపి నిర్వహణ, బిపి షుగర్ వ్యాధిగ్రస్తులకు మందులు పం పిణి చేయడం టి హెచ్ యు బి రక్త పరీక్ష నమూనాలు సేకరించడం చేయాలని అత్యవసరమైన మందులు అన్ని వేళలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బయో మె డికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించాలని, సిబ్బంది పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలని తెలియచేసారు.
అనంతరం పట్టణ ప్రా థమిక ఆరోగ్య కేంద్రం పాత కొత్తగూడెంను సందర్శించారు ౄr రాకేష్ ను ఎమర్జెన్సీ మందులు అందుబాటులో ఉంచుకోవాలని, జ్వరం కేసులు, వాంతులు విరోచనాలు కేసులు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచి, వడదెబ్బ పై ప్రజలు ఆరోగ్య విద్యా బోధన చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ డాక్టర్ అజ య్ , పాయం శ్రీనివాస్ , రాంప్రసాద్ హెచ్ ఈ ఓ బస్తీ దావఖానా సిబ్బంది పాల్గొన్నారు.