10-11-2025 01:06:14 PM
తాండూరు,(విజయశాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు ప్రముఖ వైద్యులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ఓ నిరుపేద కుటుంబానికి ఆపదలో ఆర్థిక సహాయ అందించి ఆదుకున్నారు. తాండూరు పట్టణం 33వ వార్డ్ పవరే శ్రీనివాస్ రావు ఈరోజు హఠాత్తుగా మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ ఆ నిరుపేద కుటుంబానికి సానుభూతి తెలుపుతూ అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందించారు. ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలిచిన డాక్టర్ సంపత్ కుమార్ కు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు .