15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అదుపుతప్పి లారీ బోల్తా.. ఉల్లిగడ్డ బస్తాలెత్తుకుపోయిన జనం

10-11-2025 12:52 PM

ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్తున్న ప్రయాణికులు.

చిట్యాల,(విజయక్రాంతి): జాతీయ రహదారి 65(National Highway 65) పై నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద ఉల్లిగడ్డల లారీ హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్స్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే అటుగా వెళుతున్న ప్రయాణికులు మాత్రం వారి వాహనాలను పక్కన నిలిపి ఉల్లిగడ్డ బస్తాలను ఎత్తుకెళ్లారు. లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్ ఇబ్బందుల్లో ఉండగా, మానవత్వం మరిచి  దొరికిందే అవకాశం గా భావించి ఇలా ఉల్లిగడ్డ బస్తాల ఎత్తుకెళ్లడం పలువురిని విస్మయానికి గురిచేసింది.