calender_icon.png 29 June, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు ఇందిరమ్మ రాజ్యంలోనే సొంతింటి కల సాకారం

29-06-2025 12:29:51 AM

దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దౌల్తాబాద్,(విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సొంతింటి కల స్వప్నం సాకారం కాబోతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు లభిస్తాయని, ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని అన్నారు.రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులందరికీ మూడు పూటలా కడుపునిండా తినడానికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రూ.500 గ్యాస్ పంపిణీ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని పేర్కొన్నారు.