20-06-2025 02:43:15 PM
హైదరాబాద్: నగరం, దాని శివారు ప్రాంతాల్లో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడిని చింతల్లోని వాజ్పేయి నగర్ నివాసి, డ్రైవర్ శ్రీరామ్ నరసింహా చారి అలియాస్ నయామి అలియాస్ రాజేష్ (39) గా గుర్తించారు. అరెస్టు చేసిన వ్యక్తి వద్ద నుంచి రూ.2 లక్షలకు పైగా విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చారి గతంలో ట్రై-కమిషనరేట్ల పరిధిలో 24 కేసుల్లో ప్రమేయం ఉందని.. అతను హైదరాబాద్లో మూడు, సైబరాబాద్లో ఐదు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 చోరీలకు పాల్పడ్డాడని ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జి. జగన్ తెలిపారు. డ్రైవర్, వడ్రంగి అయిన చారి, మద్యం సేవించడం వంటి అన్ని చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తన ఖర్చులను భరించలేక దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. జూన్ 16న, హబ్సిగూడలోని ఒక ఇంట్లో బంగారం, వెండి వస్తువులను దొంగిలించాడు. ప్రధాన ద్వారం పక్కన ఉన్న గ్రిల్స్ను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం ఆధారంగా, పోలీసులు చారిని అరెస్టు చేశారు.