calender_icon.png 14 June, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

13-06-2025 08:06:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలకు ఎలాంటి రోగాలు రావని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలకు అంటురోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.