19-09-2025 03:10:09 PM
ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు
ఖానాపూర్ (విజయక్రాంతి): ప్రతి శుక్రవారం విధిగా అన్ని గ్రామాల్లో డ్రైడే పాటించాలని ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు అన్నారు .ఈ మేరకు శుక్రవారం ఆయన ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్ పూర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి సిబ్బందితో నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించారు. పలు ఇళ్లల్లో ఇనుప తొట్టిలు, కుండీ,లలో ఉన్న నీళ్లను పారబోయించి దోమలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకోసం ఎక్కడ కూడా నీళ్లు నిలువ ఉండకుండా చూడాలని ఆయన కోరారు.