calender_icon.png 19 June, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్పీ సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు...

19-06-2025 03:02:18 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ కార్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ను డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సైబర్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశం డీఎస్పీ మాట్లాడుతూ నేటి రోజుల్లో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోవడం జరిగింది దీన్ని దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియచేసారు. కొన్ని ముఖ్య అంశాలను వివరిస్తూ అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఒక కంపెనీ నుండి మీకు బహుమతి వచ్చింది అని మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ అడగడం చేస్తున్నారు.

ఆన్లైన్ గేమ్ లు ఆడడం, సోషల్ మీడియాలో ఫోన్ కాల్ ద్వారా పరిచయాలు చేసుకొని బ్లాక్ మెయిల్ చేయడం, ఫోన్ డేట బ్లాక్ చేయడం, కొంతమంది పోలీస్ డ్రెస్ లు వేసుకొని మేమే పోలీసులమని  బెదిరించి వారి నుండి వసూళ్లు చేయడం. ఫోన్ పే గూగుల్ పే ద్వారా కొన్ని డబ్బులు పంపి తిరిగి ఫోన్ చేసి మా డబ్బులు మీ ఖాతాలో పడ్డాయని మభ్యపెట్టి వారి నుండి తిరిగి డబ్బులు పంపాలని లాంటివి చేస్తూ ప్రజల దాచుకున్న డబ్బులను సైబర్ నేరగాళ్లు కొల్లగోతున్నారు. వాట్స్ యాప్ గ్రూపుల్లో ఒక లింక్ పెట్టడం తెలియని వారు లింకు ఓపెన్ చేయడంతో డబ్బులు పోయాయని గగ్గోలు పెట్టడం ఇలాంటి సంఘటనల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇందులో సిఐ. రంగా కృష్ణ, ఎస్ఐ శివానందం లు ఉన్నారు.