calender_icon.png 27 January, 2026 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంకు బస్సులు ప్రారంభించిన డి.ఎస్.పి సతీష్ కుమార్

27-01-2026 04:14:47 PM

మేడారంకు బస్సులు ప్రారంభించిన డి.ఎస్.పి సతీష్ కుమార్

పాల్వంచ,(విజయక్రాంతి): మేడారం జాతర సందర్భంగా పాల్వంచ బస్టాండ్ నుండి మేడారం వరకు వెళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. పాల్వంచ నుండి మేడారంకు 150 కిలోమీటర్ల దూరంకి గాను పెద్దలకు రూ.310, పిల్లలకు రూ.170 టికెట్ ఛార్జితో మహిళలకు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించ వచ్చని తెలిపారు.

మేడారం వెళ్ళు భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగపరచుకోవాలని భద్రాచలం డిపో మేనేజర్ జంగయ్య కోరారు.  ఈ కార్యక్రమంలో మధిర డిపో మేనేజర్ రామయ్య, కొత్తగూడెం డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, చీఫ్ ఇన్స్పెక్టర్ విజయ శ్రీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాంకుమార్, సామాజిక సేవా కార్యకర్త యడ్లపల్లి శ్రీనివాసరావు , ఇజ్రాయిల్ ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు