27-01-2026 04:18:07 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పిఎసిఎస్ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి పి.రామామోహన్, క్లస్టర్ అధికారి రమేష్, మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, సంఘ మాజీ డైరెక్టర్ రఘు రాములు, సంఘ కార్యదర్శి బాల్ రెడ్డి, సంఘం రైతులు పాల్గొన్నారు.