27-06-2025 01:24:43 AM
ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, జూన్ 27 (విజయక్రాంతి): మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా ఎస్పీ డా: జి.జానకి షర్మిల అన్నారు. గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యం లో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల ను నిర్వహించారు. గంజాయి,మాదక ద్రవ్యా ల నిర్మూలన కోసం పౌరులు, యువత కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
భావితరాల కు మంచి సమాజాన్ని అందించాలన్న సదుద్దేశ్యంతో జిల్లాలో గత వారం రోజులుగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, మాదకద్రవ్యాల దుర్వినియోగం, వాటి వల్ల కలిగే నష్టాల గురించి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, స్లోగన్ రైటింగ్, డ్రాయింగ్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగే నష్టాలను గుర్తెరగాలని, మత్తులో జీవితాలకు చిత్తవుతాయని గుర్తించాలన్నారు.
డ్రగ్-రహి త సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారాల ని, బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో కలిసి మానవ హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో ఎవరైన గంజాయి వంటి ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించిన అక్రమ రవాణా చేసినట్లు తెలిసిన వాటిని ఉక్కుపాదం తో అణచివేస్తామన్నారు. మిషన్ గాంజా గస్తీ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల జిల్లాలో ఇది వరకుతో పోలిస్తే చాలా గంజాయి కేసు లు చాలా తగ్గు ముఖం పట్టాయని తెలిపారు. అనుమానాస్పద కార్యక్రమాలను గమనించినపుడు 8712659599 నంబరుకు సమాచారం ఇవ్వాలనీ ఎస్వీ సూచించారు.