calender_icon.png 25 December, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు క్రిస్మస్ వేడుకలు

25-12-2025 12:16:43 AM

ముకరంపురా,డిసెంబర్24(విజయక్రాంతి):కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సి.ఎస్.ఐ కేథడ్రిల్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ముందస్తు క్రిస్టమస్ పండుగ వేడుకలకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మా ట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని చా టిన ఏసు ప్రభువు ఆశీర్వాదం అందరి పైన ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో ప్రభుత్వ అధికారులు,సి ఎస్ ఐ చర్చ్ బాధ్యులు పాల్గొన్నారు.