04-06-2025 01:06:50 AM
న్యూఢిల్లీ, జూన్ 3: టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించింది. టర్కీ, ఈజిప్ట్, సిరియా దేశాల్లో అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అధికరాలు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
టర్కీ సరిహద్దు ప్రాంతంలోని డోడెకానీస్ దీవుల సమీపంలో 6.2 తీవ్రతతో కూడిన శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం రోడ్స్ నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో 68 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దక్షిణ గ్రీస్, పశ్చిమ టర్కీ సమీపంలోని ఏజియన్ సముద్ర తీర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలు ఉందని అధికారులు వెల్లడించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. మళ్లీ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున సంబంధిత అన్ని విభాగాల రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.