04-06-2025 01:10:27 AM
చెన్నై, జూన్ 3: ‘మీరేమైనా చరిత్రకారులా? మీరు కమల్ హాసన్ కావొచ్చు. మరెవరైనా కావొచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బ తీసే హక్కు మీకెక్కడిది. ఒక్క సారీ చెబితే పరిస్థితి సద్దుమణిగేది కదా.’ అని కర్ణాటక హైకోర్టు సీనియర్ నటుడు కమల్హాసన్పై సీరియస్ అయింది.
ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘థగ్ లైఫ్’ విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలను ఆదేశించాలని కోరుతూ.. కర్ణాటక హైకోర్టులో కమల్హాసన్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం విచారించింది. కేసును విచారించిన జస్టిస్ ఎం. నాగప్రసన్న కమల్హాసన్కు పలు ప్రశ్నలు సంధించారు.
ఇటీవల చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ప్రమోషనల్ ఈవెంట్లో కమల్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ నాట తీవ్ర దుమారం రేపాయి. రాజకీయ నాయకులతో పాటు అ నేక మంది కన్నడిగులు ఈ వ్యాఖ్యలపై అ భ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలిపా రు.
తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని కమల్హాసన్ కేఎఫ్సీసీకి లేఖ రాశారు. లేఖ లో కూడా క్షమాపణలు చెప్పకపోవడం గమనార్హం. జూన్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను కన్నడ నాట రిలీజ్ చేయడం లేదు.
మీరేమైనా చరిత్రకారుడా లేక.. సీరియస్ అయిన ధర్మాసనం
కేఎఫ్సీసీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం కమల్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నాగప్రసన్న నటుడికి పలు ప్రశ్నలు సంధించారు. ‘మీరు కమ ల్హాసన్ కావొచ్చు. మరెవరైనా కావొచ్చు.. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. నీరు, భూమి, భాషే పౌరులకు ముఖ్యమైనవి. పజాప్రతినిధిగా ఉన్న మీరు అలాంటి ప్రకటన చేయకూడదు.
మీ వ్యాఖ్యల వల్ల కన్నడ నాట అశాంతి ఏర్పడింది. మీరు ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారు? మీరేమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా? మీ వ్యాఖ్యలకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి. ఇంతలా వ్యాఖ్యా నించి కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన మీరు క్షమాపణ చెబితే సరిపోవు కదా? వా రు కేవలం మీ నుంచి క్షమాపణలు మాత్ర మే ఆశించారు. ఇంత గొడవకు కారణం మీరు. కేవలం క్షమాపణ చెబితే సరిపోయేది కదా.
అది కూడా చెప్పలేరా.? మీరు క్షమాపణ చెప్పనపుడు కర్ణాటకలో మీ సినిమాను ఎందుకు ప్రదర్శించాలని అనుకుంటున్నా రు. భావప్రకటనా స్వేచ్ఛ ఇతర మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదు. మీరు కర్ణాటక నుంచి కోట్లు సంపాదించాలని అనుకుంటున్నారు.. కాబట్టి క్షమాపణలు చెబితే సమస్య లేదు. మీరు ఇక్కడ డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు.’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఎందరో క్షమాపణలు చెప్పారు మీరెంత
భాషకు సంబంధించిన వ్యాఖ్య ల విషయంలో ఎందరో క్షమాపణలు చెప్పారని కోర్టు అభిప్రాయ పడింది. ‘దశాబ్దాల కిందట రాజగోపాలాచారి వంటి మహోన్నత వ్యక్తే భాషకు సంబంధించిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.భాష అనేది ప్రజలతో మమేకమైన ఒక భావోద్వేగం.
మీరు దాన్ని దెబ్బతీసేలా ఏదో వ్యాఖ్యానించారు.’ అని కోర్టు అభిప్రాయపడింది. కేఎఫ్సీసీతో సంప్రదింపులు జరిపేందుకు తమకు వారం సమయం ఇవ్వాలని ప్రొడ్యూసర్ తరఫు న్యాయవాది కోరడంతో ఈ కేసుకు సంబంధించిన విచారణను కోర్టు ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.