04-06-2025 01:05:01 AM
ముంబై, జూన్ 3: ‘ఆపరేషన్ సిందూర్’ జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ 48 గంటల్లో దాడులు నిర్వహించి భారత్ను మోకరిల్లేలా చేయాలనుకుందని.. కానీ తాము కేవలం 8 గంటల్లోనే ఆపరేషన్ ముగించామని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట కవ్వింపు చర్యలకు దిగిందన్నారు.
నిజానికి భారత ఆర్మీ ఉద్దేశం అది కాదని.. కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), పాక్లోని ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేయడమేనన్నారు. పహల్గాం దాడికి ముందు పాకిస్థా న్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్తో పాటు హిందువులపై విషం చిమ్మార న్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, ఇక్కడ రక్తపాతం సృష్టించడమే వారి విధానమని మండిపడ్డారు.
మంగళవారం పుణేలో ని సావిత్రిబాయి ఫూలే పుణే విశ్వవిద్యాలయంలో ‘భవిష్యత్తు యుద్ధాలు యుద్ధక్షేత్రా లు’ అనే అంశంపై సీడీఎస్ అనిల్ చౌహాన్ ప్రత్యేక ఉపన్యాసమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. యుద్ధంలో ఎంత నష్టపో యామ న్నది ముఖ్యం కాదు..
అంతిమంగా సాధించే ఫలితమే ప్రధానమని పేర్కొన్నారు. అప్పుడప్పుడు తగిలే ఎదురుదెబ్బల వల్ల పటిష్ట మైన సైనిక దళాలు పెద్దగా ప్రభావితం కావ ని తెలిపారు. పరిస్థితులకు తగ్గట్టుగా మారగలగడం అనేది వృత్తి పరమైన సైనిక శక్తికి ముఖ్యమైన లక్షణమన్నారు.
దాడులు తట్టుకోలేక కాళ్ల బేరానికి
పహల్గాం దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్కు ముందుగానే సమాచార మిచ్చామని అనిల్ చౌహాన్ తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పీవోకే, పాకిస్థాన్లో దాడులు నిర్వహించనున్నట్టు మే 7న తెలియజేశామన్నారు. మే 10వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంటకు దాడులు ప్రారంభమయ్యాయని, 48 గంటల్లో భారత్ను మోకరిల్లేలా చేయాలనుకొని పాకిస్థాన్ దాడులు చేపట్టిందన్నా రు. తొలుత ఆపరేషన్ 48 గంటల పాటు సాగుతుందని పాక్ భావించిందని, కానీ కేవలం 8 గంటల్లోనే ఆపరేషన్ ముగిసిపోయిందని పేర్కొన్నారు.