22-07-2025 08:01:06 AM
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సిఆర్(Delhi-NCR) అంతటా మంగళవారం ఉదయం భూ ప్రకంపనలు(Earthquakes) సంభవించాయి. ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. ఉదయం 6 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం నమోదైందని, ఫరీదాబాద్ దాని కేంద్రంగా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(National Center for Seismology) తెలిపింది. భూకంపం లోతు అక్షాంశం వద్ద 5 కి.మీ దిగువన, ఉత్తరం వైపు 28.29 డిగ్రీలు, తూర్పు రేఖాంశం వైపు 72.21 డిగ్రీల వద్ద ఉందని అధికారులు వెల్లడించారు. ''హర్యానాలోని ఫరీదాబాద్లో ఈరోజు ఉదయం 6.00 గంటలకు రిక్టర్ స్కేల్పై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది." అని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ లో పేర్కొంది.