05-12-2024 01:23:49 AM
భూకంప కేంద్రం : ములుగులోని మేడారం
తీవ్రత : రిక్టర్ స్కేలుపై 5.3
సమయం: ఉదయం 7.27 గంటలకు
వ్యవధి: 3 నుంచి 5 సెకన్లు
ప్రభావ రాష్ట్రాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో పలు జిల్లాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మూడు నుంచి ఐదు సెకన్లపాటు కంపించిన భూమి అందరినీ భయాందోళనకు గురిచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది.
ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్లలోంచి రోడ్డుమీదకి వచ్చారు. ఒక్కసారిగా భవనాలు ఊగడంతో ఆందోళనకు గురయ్యారు. ఉదయం 7.27 గంటలకు దాదాపు 3 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనాల తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది.
భూకంప కేంద్రాన్ని ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఐలాపూర్ అటవీ ప్రాంతంలోని మేడా రం జాతర సమీపంలో గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూమికి 40 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో భూమి ఉపరితలం పైకి స్వల్ప ప్రకంపనలు మాత్రమే వచ్చాయని వెల్లడించింది.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో వస్తే ప్రభావం చాలా ఎక్కువగా ఉండేదని పే ర్కొంది. తెలంగాణ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై ౫.౩గా నమోదైన తీవ్రత ౫౯ ఏళ్ల తర్వా త కనింపించిందని భూభౌతిక శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రకంపనలు హైదరాబా ద్, నల్లగొండ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో కనిపించాయి. ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి, నాగపూర్లలో భూప్రకంపనలు వచ్చాయి.
ఈ ఏడాది మార్చిలో..
2024 మార్చి 14న ఏపీలో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. తిరుపతిలో 13.84 అక్షాంశం, 79.91 రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లుగా పేర్కొంది. రిక్టార్ స్కేలుపై 3.9 గా నమోదైందని ట్వీట్ చేసింది. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించింది.
అప్పట్లో ఆదిలాబాద్ జిల్లాలో..
2022లో అక్టోబరు 12న రాత్రి భూమి కంపించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్లో ప్రకంపనాలకు ప్రజ లంతా బయటకు పరుగులు తీశారు. ఉట్నూర్లోని, వజీర్పురా, మోమిన్పు రా, ఫకిర్గుట్ట ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. రాత్రి 11:12 గంటలకు రెండు సెకన్లపాటు కంపించింది.
2022 13 జూలై నెల్లూరు, కడపలో..
నెల్లూరు, కడప జిల్లాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 5.20 గంటలకు 3 సెకన్లపాటు భూమి కంపించింది. మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, కండ్రిక, పడమట నాయుడుపల్లి, చిలకపాడు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో భూకంపం వచ్చింది.
2021 అక్టోబర్లో..
తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సమీపంలో సాయంత్రం 6:49 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రామగుండం, జగిత్యాల జిల్లాలలో ప్రకంపనలు వచ్చాయి. లక్షెట్టిపేట, గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 3 సెకన్లు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో వస్తువులు కిందపడ్డాయి.
2021 26 జూలై నాగర్ కర్నూల్లో..
నాగర్కర్నూల్ జిల్లాలో కూడా 26 జూలై 2021లో భూ కంపం వచ్చింది. రిక్టార్ స్కేలుపై 4.0 తీవ్రతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్, ఉప్పునూత మండలాల్లో ఉదయం 5 గంటలకు రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో భయపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తక్కువ తీవ్రతతో భూకంపం రావడం వల్ల ఆస్తి నష్టం పెద్దగా జరగలేదు.
2021 జులైలో..
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో ౨౦౨౧ జులైలో అర్ధరాత్రి భూ కంపనలు ప్రజలను భయపెట్టాయి. అర్థరాత్రి వేళ జనం భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. ఈడిగపల్లె, చిలకవారిపల్లి, షికారిపాళ్యం, కోటగడ్డలో 6 సెకన్ల పాటు భూమి కదిలింది. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఏం జరుగుతోందో అర్థంకాక కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.