6 June, 2026 | 11:20 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఆర్థిక శాస్త్రం

16-04-2025 12:00 AM
  1. మనిషి మనుగడ ఆర్థిక శాస్త్రం పైనే ఆధారపడి ఉంది 
  2. పియు కళాశాల ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్ ఏప్రిల్ 15 (విజయ క్రాంతి) : ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఆర్థిక శాస్త్రమేనని పియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆర్థిక శాస్త్రం దేశాభివృద్ధి లో ముఖ్యభూమిక  అనే అంశంపై పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీలో సెమినార్ హాల్ యందు అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని జాతీయ అర్థశాస దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దేశాభివృద్ధిలో ఆర్థిక శాస్త్రం ముఖ్య భూమిక వహిస్తుందని, ఎగుమతులను ప్రోత్సహించాలని, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని, స్వదేశీ వస్తువులను కొనడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అన్నారు. భూమి పై జీవిస్తున్న మనిషి మనగడ ఆర్థిక శాస్త్ర పైనే ఆధారపడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాఘవేంద్రరావు, అధ్యాపకులు డాక్టర్ జిమ్మీ కార్టన్,  డా శివలింగం, రాజ్ నాయక్ పాల్గొన్నారు.