18 March, 2026 | 11:46 AM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈడీ సోదాలు

01-08-2024 01:35 AM

పలు కీలక పత్రాలు, దస్త్రాలు స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): నగరంలో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. మహేశ్  కోఆపరేటివ్ బ్యాంకులో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. అనర్హులకు రుణాలు మంజూరు చేశారన్న ఆరోపణలపై ఈడీ విచారణ కొనసాగిస్తున్నది. సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ అధికారులు నగరంలోని మహేశ్  కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మహేష్ బ్యాంకు చైర్మన్ రమేష్‌కుమార్, ఎండీ పురుషోత్తం దాస్‌తో పాటు సీఈవో డైరెక్టర్ల ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయి. సోలిపురం వెంకట్‌రెడ్డితో పాటు వారి పిల్లలు, సోదరుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. 

అయితే బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది. రూ.300 కోట్ల నిధుల గోల్‌మాల్‌పై నమోదైన కేసు నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. పలు కీలక పత్రాలు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.