15 June, 2026 | 10:22 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

నిత్య అవసరాల కోసం పోరాడుతున్న ఫర్ ఎ బెటర్ సొసైటీ చేసిన ప్రయత్నం ఫలించింది

19-12-2025 09:51 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యం, నిత్య అవసరాల కోసం నిత్యం పోరాడుతున్న ఫర్ ఎ బెటర్ సొసైటీ చేసిన ప్రయత్నం ఫలించిందని ఫర్ ఎ బెటర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పు జస్వంత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రగతి నగర్ పరిధిలో ఉన్న అంబీర్ చెరువు కలుషితమవ్వడం, స్మశాన వాటికలో వ్యర్ధాలను వేసి ప్రజలను అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఉప్పు జస్వంత్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన ఒక్క రోజులోనే స్పందించిన హైడ్రా కమిషనర్ దర్యాప్తు చేయమని హైడ్రా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నలుగురు హైడ్రా సిబ్బందిని అక్కడే ఉండేలా నియమించారు. నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్, హైడ్రా బృందాలు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకుంటామని ఫర్ ఎ బెటర్ సొసైటీ కి తెలియజేశారు.