calender_icon.png 7 June, 2025 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాధాన్యత క్రమంలో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

06-06-2025 10:34:10 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ప్రాధాన్యత క్రమంలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో రుక్మిణీ ఎస్టేట్స్ నందు చేపట్టిన సీసీ రోడ్డును బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ...  జీడిమెట్ల డివిజన్ తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి  పరుస్తామన్నారు.