06-06-2025 10:37:07 PM
దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని మండల విద్యాధికారి గజ్జేల కనకరాజు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు.