14-06-2025 12:00:00 AM
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఎల్బీనగర్, జూన్ 13 : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చేపట్టబోయే పనులను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్ పరిశీలించారు. గురువారం జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి, పలు శాఖల అధికారులతో కలిసి డివిజన్లోని ఆయా ప్రాంతాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జడ్జస్ కాలనీ ఫేజ్ -1 లో హిందూ స్మశాన వాటికలో రూ.54.40 లక్షల తో చేపడుతున్న పనులను పరిశీలించి ఒక మోడల్ హిందూ స్మశాన వాటికగా తీర్చిదిద్ది అందుబాటులోకి తెస్తామని తెలిపారు. వర్షం వస్తే కే బీ ఆర్ కన్వెన్షన్, కాస్మోపాలిటన్ కాలనీ నుండి వచ్చే వర్షపునీరు వీకర్ సెక్షన్ కాలనీ మీదుగా నిత్యం ప్రవహిస్తుంటుందని ఆ వర్షపు నీటిని తరలించడానికి రూ. 80లక్షలతో స్టార్మ్ వాటర్ డ్రైన్ నాలాను 2 బీ హెచ్ కె వద్ద ఉన్న నాలాకు కలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ సర్కిల్ డీసీ టి. యాదయ్య, ఇంజనీరింగ్ శాఖ ఈ ఈ రమేష్ బాబు, డీఈ కనకయ్య, ఏఈ స్వప్న తదితరులుపాల్గొన్నారు.