29-05-2025 01:43:15 PM
విద్యుదాఘాతంతో 8 పాడి గేదలు మృతి
మహబూబాబాద్,(విజయక్రాంతి): పశువులకు విద్యుత్తు లైన్లు(Power lines) పాశానంగా మారుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే వందలాది పశువులు (buffaloes)విద్యుత్ ఘాతానికి గురై మరణించగా, తాజాగా గురువారం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో తెగిపడ్డ విద్యుత్తు లైనుకు విద్యుత్ సరఫరా జరిగి 8 పాడి గేదెలు మరణించాయి.
గ్రామానికి చెందిన కాలేరు భాస్కర్, దేవేందర్, రమేష్, హరీష్, శివాజీ, రాజా ,చిన్న దేవేందర్ , రాజశేఖర్ లకు చెందిన పాడి గేదెలను మేత కోసం వదిలిపెట్టారు. గ్రామ సమీపంలోని పొలంలోకి వెళ్లిన గేదెలు తెగిపడ్డ విద్యుత్తు తీగలు దాటుతుండగా ఒకేసారి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాయి. విద్యుత్ లైన్ తెగిపడ్డా విద్యుత్ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల, విద్యుత్ సరఫరా కావడంతో గేదెలు మరణించారని, గేదెల మరణంతో ఆర్థికంగా నాలుగు లక్షల వరకు నష్టపోయామని బాధితులు పేర్కొన్నారు.