calender_icon.png 13 November, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ: 8 మందికి తీవ్రగాయాలు

19-05-2024 04:21:25 PM

మిర్యాలగూడ: నల్లొండ జిల్లా మిర్యాలగూడ నందిపాడు బైపాస్ వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ టాటా ఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.