19-05-2025 01:14:31 AM
మూల స్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పని చేయాలన్న సీజేఐ జస్టిస్ గవాయ్
ముంబై, మే 18: న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు భారత రాజ్యాంగానికి మూలస్తంభాలని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఆదివారం మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘న్యాయ, కార్యనిర్వాహక, పార్లమెంట్ వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనది. మూల స్తంభాలుగా ఉన్న ఈ మూ డు కలిసి పని చేయాలి.
ఏ ఒక్క విభాగం కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించకూడదు. ఈ వ్యవస్థలు సహ కారం అందించుకుంటూ పరస్పరం గౌరవించుకోవాలి’ అన్నారు. బీఆర్ గవాయ్ తగంలో ఇచ్చిన 50 కీలకతీర్పులతో రూపొందించిన పుస్తకా న్ని ఆయన ఆవిష్కరించారు. అంబేద్కర్ స్మారకమైన చైత్యభూమిని గవాయ్ సందర్శించారు. 52వ సీజేఐగా పదవీబాధ్యతలు స్వీకరించిన గవాయ్ తొలిసారి తన సొంత రాష్ట్రంలో పర్యటించారు.