23 May, 2026 | 6:41 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు

29-11-2025 06:58 PM

* నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్...

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా పోలీసు చర్యలు చేపడుతున్నట్టు, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారుల ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో చివరి రోజు నామినేషన్ సందర్భంగా శనివారం ఇచ్చోడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు.

చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ప్రజలు క్యూ కట్టి తమ గ్రామ పంచాయతీల పరిధిలో తమ సత్తా చాటుకోవడానికి నామినేషన్ దాఖలు చేయడంతో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఇచ్చోడ గ్రామ పంచాయతీ భవనంలో ఇచ్చోడ, దుబాయ్ పేట్, అడేగామా కె, అడేగామా (బి) గ్రామాల నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. దాని పరిశీలించి ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి కావాలని అధికారుల ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా నాలుగు చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని అందులో మూడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లు జైనథ్ పిప్పర్ వాడ, బోథ్ ఘన్పూర్, తలమడుగు లక్ష్మీపూర్ లలో అదే విధంగా జాతీయ రహదారిపై నేరడిగొండ నందు రోల్ మామడ చెక్పోస్ట్ ద్వారా ఎన్నికలలో ప్రభావితం చేయకుండా డబ్బు, మద్యం, ఇతరత్రా సామాగ్రి తరలకుండా పర్యవేక్షించడం జరుగుతుంది.