కామారెడ్డి పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి, ఆగస్టు 13 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ మునూరు కాపు సంఘం అధ్యక్షులు గా ముదాం వెంకటేశ్వర్ (వెంకన్న) ,ప్రధాన కార్యదర్శిగా రామడిపేట రాజు, కోశాధికారిగా అనుమండ్ల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ముదాం వెంకటేష్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ మున్నూరుకాపు సంగం అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకెళ్తానని పేర్కొన్నారు. అనంతరం కుల సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
త్వరలోనే పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు రావుల గంగాధర్, ముదాం శ్రీనివాస్, బొజ్జ రవి, స్వామి, గాండ్ల వెంకట్ రాజ్, సాయిలు, నవీన్, జెర్సీ నర్సింహులు, నాగరాజు, రాజు, సచిన్ ,రాజు, వేణు, శ్రీనివాస్, గణేష్, నారాయణ, సురేష్, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, సత్యం, లింగం, రాజేష్, అరుణ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.






