24 March, 2026 | 6:11 AM

ఎన్నికల హామీలు నెరవేర్చాలి

24-03-2026 12:00 AM

నిజామాబాద్, మార్చి 23 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను  ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ, సోమవారం ఉదయం  బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి  ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా పోలీసులు పార్టీ నాయకులను, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా కలెక్టరేట్ ముట్టడిని చేపట్టారు. 

ప్రమోద్ కుమార్, పాలెపు రాజు, దాంపల్లి జ్యోతి, పోల్కం వేణు, సంఘం అనిల్, ఓం సింగ్ నాయక్, నాయిడి రాజన్న, చింత ప్రసన్నారెడ్డి బొబ్బిలి వేణు, బంటు ప్రీతి, కల్పే అర్చన, శశాంక్ రెడ్డి, ఇప్పకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, నిమ్మల శ్రావణ్,ఎర్రం సుధీర్, యాదాల నరేష్, మల్క మహేందర్ ఆనంద్ రావు, శంకర్ రెడ్డి, జగన్ రెడ్డి, గడ్డం రాజు,  జంగిటి ఆనంద్, దండు శ్రీకాంత్ పాల్గొన్నారు.