26-05-2025 12:57:42 AM
రాజేంద్రనగర్, మే 25: ఓ విద్యుత్ స్తంభానికి ఉన్నట్టుండి మంటలు రావడంతో సానికులు ఆందోళనకు గురైన సంఘటన ఆదివారం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ కృష్ణారెడ్డి కాలనీలో జరిగింది. కాలనీలోని లేన్ నెంబర్ 4 లో కరెంటు స్తంభానికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
చూస్తుండగానే భారీగా ఎగిసిపడడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. స్తంభానికి ఉన్న నాలుగు సీసీ కెమెరాలు, జంక్షన్ బాక్స్ మీటర్ బాక్స్ కాలిపోయాయని స్థానికు లు పేర్కొన్నారు. అడ్డగోలుగా కేబుల్ తీగలు ఉండటంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు.