calender_icon.png 7 June, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలుకతుర్తి బహిరంగ సభ కాంగ్రెస్ పతనానికి నాంది

18-04-2025 01:14:45 AM

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హుజురాబాద్,విజయక్రాంతి: ఏప్రిల్17: ఎలుకతుర్తి బహిరంగ సభతో కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలోఆయనమాట్లాడుతూ.. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో తలపెట్టిన బహిరంగ సభకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కథానాయకులై కదలి రావాలన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గం నుండి సుమారు లక్షమంది తరలిరావాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీకి హుజురాబాద్ కంచుకోటఅని ఎలుకతుర్తి జనసముద్రంగా    మారాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దాకా కాంగ్రెస్ పార్టీ పై పోరాటానికి సిద్ధమన్నారు.15 నెలల్లోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని. రాబోయే రోజుల్లో మళ్ళీ టిఆర్‌ఎస్ పార్టీదేఅధికారమని దిమ వ్యక్తం చేశారు. బి ఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎర్రవెల్లి కొండారెడ్డి తోపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.