15-06-2025 08:37:02 AM
హైదరాబాద్: ఓ ప్రైవేటు ఉద్యోగి పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. ఈ సంఘటన నిజామాబాద్(Nizamabad) జిల్లాలో కలకలం రేపింది. ఏటీఎంలో నింపాల్సిన నగదుతో ఉద్యోగి పరారీ అయ్యారు. రూ. 40.5 లక్షల నగదుతో ఏటీఎం కస్టోడియన్(ATM Custodian) ఉడాయించారు. ప్రైవేట్ భద్రతా సంస్థలో రమాకాంత్ ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. నగదు తీసుకెళ్లే వాహనం ఆలస్యం కావడంతో ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేట్ భద్రతా సంస్థ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.