calender_icon.png 15 June, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో భక్తుల రద్దీ

15-06-2025 07:48:46 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం (Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) సేవాసదన్ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న రికార్డు స్థాయిలో 91,720 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 44,678 మంది భక్తులు తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) వెల్లడించారు. తిరుమలలో నేటితో అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. నేడు చక్రస్నానం, ధ్వజావరోహణం కార్యక్రమాలు  చేపట్టనున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు టీటీడీ జూనియర్ కళాశాలల్లో రెండో విడత కౌన్సిలింగ్(TTD Junior Colleges) కొనసాగనుంది. రేపటి నుంచి 19 వరకు టీటీడీ పాఠశాలల్లో జరగనున్న సద్గమయ శిక్షణ తరగతులు వాయిదా పడ్డాయి.