ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి

06-05-2024 01:20:46 AM

జహీరాబాద్, మే 5 : ఎన్నికల్లో విధులు నిర్వహించే 460ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సహయాధికారి, ఆర్డీవో రాజు తెలిపారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కశాశా లలో ఏర్పాటు చేసిన పెసిలిటేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 1730మంది పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఇందులో 460మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు. ఈ నెల 8వ తేది వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకా శాన్ని నియోజకవర్గంలో విధులు నిర్వహించే ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.