తలపాగా చుట్టి.. ఎడ్ల బండి తోలి

06-05-2024 01:16:15 AM

ఆదిలాబాద్, మే 5 (విజయక్రాంతి) : ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదివారం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఆదివారం వినూత్న ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన చైతన్య సదస్సుకు ఆయన తలపాగా చుట్టి, ఎడ్లబండి తోలుతూ హాజరయ్యారు.  అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలకోసారి ఎన్నికలు వస్తాయని, ఆ ఎన్నికలే ప్రజల తలరాతలు మారుస్తాయన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు.