calender_icon.png 8 June, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

26-05-2025 05:37:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ ఉపాధి కల్పించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో సోమవారం నాడు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇల్లు ట్రైవింగ్ సర్టిఫికేట్, 1800/- వేతనం ఇప్పించడం, ఇందిరమ్మ ఇల్లు నిర్మించడంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, కడం మండలంలో తాపీమేస్త్రి పనిచేసే కార్మికులం ప్రభుత్వ స్కిమ్ ఇందిరమ్మ ఇల్ల నిర్మాణం కొరకు తాపీమేస్త్రి పనిచేసే కార్మికులందరికి ప్రభుత్వం 6 రోజుల ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించింది.

తేది. 13-03-2025 నుండి 23-03-2025 ఈ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో ప్రతి రోజు 300/-రూపాయల దినసరి వేతనం, సర్టిఫికేట్ ఈ ట్రైనింగ్ హాజరయ్యే (33 మంది) ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పింది. ఇందిరమ్మ ఇల్లు నిర్మించడంలో మొదటి ప్రాధాన్యత మీకు ఇస్తామని చెప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో (CITU అనుబంధ సంఘం) భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కోటయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, గంగాధర్ వెంకటేష్, నాయకులు ఎల్లయ్య అజీమ్, అతిక్ తదితరులు పాల్గొన్నారు.