15-06-2025 01:40:55 AM
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): నీట్లో రెసోనెన్స్ హైదరాబాద్ మరోసారి తన విద్యా ప్రతిభను రుజువు చేసుకుంది. రెసోనెన్స్ విద్యార్థులు దేశవ్యాప్తంగా అత్యుత్త మ ర్యాంకులు సాధించి, భారత వైద్య రంగ భవిష్యత్తులో తమ స్థానం గుర్తింపజేశారు. హరిణి శ్రీరామ్ నీట్లో ఆల్ ఇండియా ర్యాంకు 72 సాధించింది.
రెసోనెన్స్ హైదరాబాద్ క్యాంపసుల నుంచి ప్రతి ముగ్గురిలో ఒక విద్యార్థి మెడిక ల్ సీటు సాధించడం గర్వ కారణం. హరిణితో పాటు మరెన్నో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఏఐఐఎంఎస్, జింపె ర్, వివిధ రాష్ట్రాల ప్రముఖ వైద్యకాలేజీల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. ఈ సంద ర్భంగా రెసోనెన్స్ విద్యా సంస్థల వ్యవ స్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ.. “మా విద్యార్థుల కష్టానికి, పట్టుదలకి హృదయపూర్వక శుభా కాంక్షలు.
నీట్ ఫలితాలు కేవలం ర్యాంకుల గణాంకాలు మాత్రమే కావు, ప్రతి ఒక్కరి కల నెరవేరిన కథ. ఈ విజయం వారి తల్లిదండ్రు లు, మెంటర్లు, ఫ్యాకల్టీ, మరియు రెసొనెన్స్ హైదరాబాద్ సమగ్ర సహకారానికి ప్రతి ఫలం” అని చెప్పారు. వెయ్యిలోపు ర్యాంకు లు సాధించిన రెసోనెన్స్ హైదరాబాద్ విద్యార్థులు.. హరిణీ శ్రీరామ్ 72వ ర్యాంకు, కార్తీక్ ఎంఆర్ 185, అన్షుల్ సింగ్ 225, ధీరజ్ 285, పి శ్రావ్య హండే 398 ర్యాంకులు సాధించారు.