30-08-2024 12:27:34 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించాలని హైదరాబాద్ అదనపు కలెక్టర్ వెంకటాచారి ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్లో గురువారం నిర్వ హించిన మండల, డివిజన్ రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ల్యాండ్ బ్యాంక్, పీవోబీ, ప్రభుత్వ భూముల కేటాయింపు, మూసీ ఆక్రమణలు, ఎన్ఎసీ బిల్డింగ్ అనుమతులు, ఆసరా పెన్షన్లు, వాల్టా చట్టం, మీసేవ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై సమీక్షించారు.