15 April, 2026 | 12:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

22-01-2026 06:30 PM

జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన సదస్సులో మంథని-2 ఎస్ఐ సాగర్ 

మంథని, జనవరి22(విజయక్రాంతి): ​రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంథని ఎస్ఐ-2 సాగర్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా  వాహనదారులకు అవగాహన లో భాగంగా గురువారం​ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంథని పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ‘అరైవ్ అలైవ్’  పేరిట రోడ్డు భద్రతా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వాహనదారులకు, పాదచారులకు రోడ్డు నిబంధనలపై కీలక సూచనలు చేశారు.

​ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. నిబంధనలు పాటించడం అంటే కేవలం జరిమానాల నుండి తప్పించుకోవడం మాత్రమే కాదని, క్షేమంగా ఇంటికి చేరుకోవడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ​మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఈ సందర్భంగా హెచ్చరించారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలను క్రమపద్ధతిలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మల్లయ్య తో పాటు స్థానిక వ్యాపారులు, పోలీసులు పాల్గొన్నారు.