17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఏజెన్సీ హక్కులు కల్పించాలి

22-01-2026 06:46 PM

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతులు

జైనూర్, (విజయక్రాంతి):ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు తాతలు–ముత్తాతల కాలం నుంచి నివసిస్తున్న ఏజెన్సీ దళితులకు ప్రభుత్వ పరంగా పథకాలు, హక్కులు కల్పించాలని, రైతులకు పట్టాలు, పహాణీలు మంజూరు చేయాలని కోరుతూ గురువారం మండలంలోని జంగాం గ్రామంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ జిల్లా నాయకులు కాంబ్లే బాబాసాహెబ్, మావలే దత్త మాంగ్, కాంబ్లే అన్నారావు, ఘాటే రామారావులు మాట్లాడుతూ ఏజెన్సీ ఎస్సీల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తలసేమియా, సికిల్ సెల్ జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్‌తో పాటు పలువురు నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు.