14 June, 2026 | 4:17 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మృతి

22-01-2026 06:11 PM

చైబాసా: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్ర నాయకుడు అనల్ దా సహా పదిహేను మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. కిరిబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని సరందా అటవీ ప్రాంతంలోని కుమ్డిలో జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌కు చెందిన సుమారు 1,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. మావోయిస్టు అగ్ర నాయకుడు పతిరామ్ మాఝీ అలియాస్ అనల్ దా సహా 15 మంది మావోయిస్టుల మృతదేహాలను, భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని  స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.