23-06-2025 12:00:00 AM
కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి
కోదాడ జూన్ 22: మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు కోదాడ రూరల్ స్టేషన్ పరిధి జాతీయ రహదారిపై రామాపురం క్రాస్ రోడ్ వద్ద రూరల్ సీఐ రజిత రెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లకు, హమాలిలకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించడం జరిగినది.
డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నారు, ఆరోగ్యం పాలవుతారు, కుటుంబ పెద్ద అనారోగ్యం చెందితే కుటుంభం దిక్కుతోచని స్థితిలో పడుతుంది అన్నారు. రోజువారి కూలీ జీవనం గడుపుతూ వచ్చిన డబ్బులను మత్తు పదార్థాల కోసం వృధా చేసుకోవద్దని ఆర్థికంగా నష్టపోవద్దని సిఐ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర అనిల్ రెడ్డి పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.