అవగాహనతోనే సికిల్ సెల్ నిర్మూలన
20-06-2024 12:22 AM
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 19 (విజయక్రాంతి): సరైన అవగాహనతోనే సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించవచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. ప్రజల్లో సికిల్ సెల్ వ్యాధిపై సరైన అవగాహన లేక వ్యాధి గుర్తించడంలో ఆలస్యమై అనేక మంది వ్యాధిబారిన పడుతున్నారన్నారు. ఈ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.






