14-06-2025 12:53:07 AM
జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు
మోతే: భూభారతి రెవిన్యూ సదస్సులో రైతులు పెట్టిన ప్రతి దరఖాస్తు ను పరిష్కారం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని విభాళ్ళ పురం గ్రామ పంచాయితీ కార్యాలయం లో జరిగిన భూ భారతి రెవిన్యూ సదస్సు లో పాల్గొన్న ఆయన రైతుల తో అధికారులతో మాట్లాడారు మండల వ్యాప్తంగా రైతులనుంచి వచ్చిన ప్రతి దరఖాస్తుని పరిశీలించి ఎలాంటి తప్పులు జరగకుండా ప్రతి రైతులు ఇచ్చే దరఖాస్తులో పూర్తి ఆధారులు ఉండే విధంగా చూడాలని ఆధారాలు లేని దరఖాస్తులు పరిష్కారం చేయడానికి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఆయా గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో వచ్చిన పిర్యాదులకు సంబంధించి స్థానికంగా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించి ఈ సదస్సుల తో భవిష్యత్ లో భూ సమస్యలు రాకుండా చేసుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా సుమారు 2077 దరఖాస్తులు వచ్చినట్లు మండల తహసీల్దార్ యం. వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సిబ్బంది వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.