ప్రతి ఓటర్ ఓటు వేయాలి

20-04-2024 12:25:00 AM

l కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

l వనపర్తిలో ముగ్గుల పోటీలు

వనపర్తి , ఏప్రిల్ 19 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటర్ తన ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగం గా స్వీప్ నోడల్ అధికారి ఆధ్వర్యంలో ఐడీవోసీ ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహిం చారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఆవశ్యకతను తెలిపేవిధంగా వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీలను సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాముఖ్యం ఉన్నదని, ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్న నాయకుడిని ఎంచుకోవడానికి ఓటు ఒక ఆయుధంగా ఉపయో గపడుతుందన్నారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ నగేశ్, స్వీప్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.