calender_icon.png 23 June, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పచ్చని ప్రకృతికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

23-06-2025 12:37:49 AM

హనుమకొండ, జూన్ 22 (విజయ క్రాంతి): అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు, హనుమకొండ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమo నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, టీజీ ఎన్బీ శాఖ, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి  జయంతి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ  ‘పచ్చని ప్రకృతిని కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అలాగే యువత చెడు వ్యసనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి‘ అని పేర్కొన్నారు. టీజీ ఎన్బీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, డ్రగ్స్ పట్ల యువతలో సరైన అవగాహన పెరగాలి. డ్రగ్స్ అనే మహమ్మారిని అంతమొందించేందుకు యువత ముందుండాలి అని చెప్పారు.

కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ మాట్లాడుతూ, ‘డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి. విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని నిష్టతో ముందుకు సాగాలి‘ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎన్బీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, సిబ్బంది, ఎక్సైజ్ శాఖ ఎస్‌ఐ తిరుపతి, ఎన్సీసీ లెఫ్టినెంట్ స్వామి, సిబ్బంది , కళాశాల లెక్చరర్ నహేద, నర్సింగ్ ఆఫీసర్ అరుణ కుమారి, డీసీపీఓ ఇంచార్జ్ ప్రవీణ్, ఎఫ్‌ఆర్‌ఓ రవి కృష్ణ, విమెన్ హబ్ కోఆర్డినేటర్ కల్యాణి, సఖి అడ్మిన్ హైమవతి, నషా ముఖ్త్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ తేజస్విని, జిల్లా సంక్షేమ కార్యాలయ సిబ్బంది రాజేష్, రజిత, మానస, స్వర్ణలత, కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు పాల్గొన్నారు.