05-06-2025 12:40:22 AM
- ఐఎంఏ అధ్యక్షుడిని కోరిన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు
- వైద్య పరీక్షలతోపాటు మెడిసిన్లో రాయితీ కోసం విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన అధ్యక్షుడు డాక్టర్ పీజే బాబు
కొత్తకోట, జూన్ 4 : జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు, జర్నలిస్టు కుటుంబాలకు ఉ చిత ఓపి సేవలు అందించాలని విజ్ఞప్తి చేశా రు. బుధవారం వనపర్తి ప్రెస్ కమిటీ సభ్యు లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు డాక్టర్ పీజే బాబు ను కొత్తకోటలోని తన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.... ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా పనిచేస్తు న్న జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలను అందించి సహకరించాలని కోరారు. సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఐ ఎం ఏ తరఫున సహకారం అందించి సహకరించాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో జర్నలిస్టులకు, జర్నలిస్టు కు టుంబాలకు ఉచిత ఓపి సేవలు అందించడంతోపాటు వైద్య పరీక్షలలో 50 శాతం, మందుల కొనుగోలుపై 25% రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన ఐ ఎం ఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పీజే బాబు త్వరలోనే జిల్లాలోని వైద్యులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఉచిత ఓపి సేవలతో పాటు రాయితీల వంటి జర్నలిస్టుల సమస్యలపై చర్చిస్తామన్నారు. అంతే కాకుండా జర్నలిస్టులకు ఐ ఎం ఏ తరఫున హెల్త్ కార్డులు ఇచ్చే విధంగా ప్రత్యేక కార్యక్ర మం రూపొందిస్తామని తెలిపారు. త్వరలోనే జిల్లా జర్నలిస్టులతో ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందామన్నారు.
జిల్లా జర్నలిస్టుల తరఫున ఐ ఎం ఏవైద్య బృందానికి వనపర్తి ప్రెస్ క్లబ్ (కమిటీ) తరఫున ప్ర త్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వనపర్తి ప్రెస్ కమిటీ సభ్యులు బోలేమో ని రమేష్, కొండన్న యాదవ్, బొడ్డుపల్లి లక్ష్మణ్, ఖలీల్, యాదిరెడ్డి, గంధం దినేష్, కు మార్, తిరుపతి, శ్రీనాథ్, మల్లికార్జున్, పురుషోత్తం, తరుణ్, గోపాలకృష్ణ, రవికుమార్, రాజు, రాజ్ కుమార్, రాజేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.