10-06-2025 12:00:00 AM
పాలమూరు యూనివర్సిటీ జూన్ 9 : ఈ నెల 11వ తేదీ నుంచి 14 వరకు టీజీపీ సెట్ నిర్వ హణకు సర్వం ఏర్పాట్లు చేసినట్లు పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీసీ మా ట్లాడారు.
ఈనెల 11 న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి యూనివర్సిటీ కి వస్తున్నారని,ఈ సెట్ నిర్వహణ ద్వారా పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్ట పెరుగుతుందని, తద్వారా ప్రభుత్వం మరిన్ని సెట్ ల నిర్వహణ బాధ్యత యూనివర్సిటీకి అప్పగిస్తుందని, బి. పీ ఎడ్, డి. ఎడ్ కోర్స్ లలో ప్రవేశం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకున్న విద్యార్థులు వివిధ విభాగలలో ఉత్తీర్ణత సాధించాల్సి వస్తుందని అన్నారు.
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ర్యాంకు లు ప్రకటిస్తామని, 17 కాలేజీ లలో ర్యాంకు ల ప్రకారం గా సీట్లు కేటాయించబడతాయని అన్నా రు. ఈ కార్యక్రమంలో సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిలీప్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ డా వై శ్రీనివాసులు పాల్గొన్నారు.