02-10-2025 12:00:00 AM
మహబూబ్ నగర్, అక్టోబర్ 1(విజయక్రాంతి): సాధ్యంకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ని క్యాంపు కార్యాలయంలో బాకీ కార్డు లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ బాకీ కార్డు ఉద్యమం ప్రారంభించిందని చెప్పారు.
అభయహస్తం పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మరచిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, వారి అబద్ధపు హామీలను అందరికీ గుర్తు చేసేందుకే బాకీ కార్డు ఉద్యమాన్ని చేపట్టామన్నారు. ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టేందుకు సిద్ధం ఐతుందని, క రెంటు చార్జీలు కూడా పెంచాబోతున్నారు.
రైతులకు యూరియా ఇవ్వని కాంగ్రెస్ ్ర పభుత్వం పండించిన పంట కొనుగోలు చే సేందుకు కూడా అవసరమైనా ఏర్పాట్లు చే యడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కారణంగా ఎవరికి లాభం కలిగిందో ప్రజలు ఆలోచన చేయాలి. ప్రతి మహిళకు గృహలక్ష్మి పథకం ద్వారా ఐదు వందలు రూ 2500 ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రతి మహిళకు 55వేల రూపాయలు ప్రభుత్వం బాకీ పడిందన్నారు.
వృద్ధాప్య పింఛన్ ను నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 22 నెలల కాలంలో ప్రతి వృద్ధుడికి 44 వేల రూపాయలు బాకీ పడిందన్నారు. దివంగుల పెన్షన్ ను రూ 6000 కు పెంచుతామన్న ప్రభుత్వం ఇప్పటివరకు రూ 44 వేలు ప్రతి దివ్యాంగుడికి బాకీ పడిందన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం అదనంగా ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ లక్షలాదిమంది ఆడపడుచులకు బంగారం బాకీ పడిందన్నారు.
రైతు భరోసా కింద ప్రతి రైతుకురూ 76 వేలు బాకీ పడిందన్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం ప్రతి గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి రూ 88 బాకీ పడిందన్నారు. దీంతోపాటు విద్యార్థులను స్కూటీ, విద్య భరోసా కార్డు కింద రూ 50 వేలు బాకీ పడిందన్నారు. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే నాయకులకు ఈ విషయాలపై నిలదీయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు, మాజీ జడ్పీటీసీ నరేందర్, పార్టీ మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శివరాజ్, సీనియర్ నాయకులు మల్లు నర్సింహా రెడ్డి, కొండ లక్ష్మయ్య, శ్రీ కాంత్ గౌడ్, నవకాంత్, వెదవత్, చెన్నయ్య, జంబూలయ్య తదితరులు పాల్గొన్నారు.