బంగారు తెలంగాణ విధ్వంస రాష్ట్రమైంది !

28-04-2024 01:21:35 AM

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి 

నల్లగొండ, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ కాగా, నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి విధ్వంస రాష్ట్రాన్ని సృష్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే  జగదీశ్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాల యంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లా డారు.

ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారన్నారు. నాడు సాగునీరు, తాగునీరు, కరెంట్ సమస్యలు లేవన్నారు. ప్రస్తుతంఆ వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు మద్దతు తెలుపుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, జడ్పీచైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నాయకులు విజయసింహారెడ్డి, భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.